నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రమూక కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 28మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక అనంత్ నాగ్ జిల్లాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఈ దాడిపై చర్చిండానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి పహల్గాం ఘటనపై పలు అంశాలపై చర్చించనుంది. ఈరోజు సాయంత్రం 6గంటలకు పార్లమెంట్ వేదికగా ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. ఆ సమావేశానికి దేశంలోని అన్ని పార్టీల నేతలకు సమాచారం పంపించారు. ఈ భేటీలో జమ్మూకశ్మర్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, భద్రతా పరమైన తదితర అంశాలపై చర్చించన్నారు. అంతేకాకుండా దాడి తర్వాత కేంద్రం తీసుకున్న చర్యలు, పరిణామాలపై ప్రతిపక్షాలకు తెలియజేయన్నారు.
కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం..‘పహల్గాం’ ఘటనపై ఆల్ పార్టీ మీటింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES