Tuesday, June 3, 2025
E-PAPER
Homeకరీంనగర్ఆధ్యాత్మిక వైభవం.. రాజన్న క్షేత్రం

ఆధ్యాత్మిక వైభవం.. రాజన్న క్షేత్రం

- Advertisement -

చరిత్రలో నిలిచేలా రాజన్న ఆలయ అభివృద్ధి..
ఆధ్యాత్మిక – సుందర పర్యట కేంద్రంగా ప్రణాళికలు..
మొదటిసారి 1979 ఆలయ పునరుద్దరణ పనులు..
శృంగేరి పీఠాధిపతుల సూచనతో ఆలయ విస్తరణ..
100 సంవత్సరాల మాస్టర్ ప్లాన్ తో అభివృద్ధికి ప్రణాళికలు..
ఆలయ, పట్టణ అభివృద్ధికి ప్రభుత్వ విప్ ఆది కృషి..
ఆధ్యాత్మిక – వైభవం రాజన్న క్షేత్రం.. పర్యాటక కేంద్రంగా పట్టణ, దేవాలయ అభివృద్ధి..
వేములవాడ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. 
నవతెలంగాణ – వేములవాడ 

స్థల విశిష్టత : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న క్షేత్రాన్ని లేంబాల వాటిక, భాస్కర, హరి హర క్షేత్రంగా రాజేశ్వర ఖండంలో చెప్పబడింది. అర్జునుడి ముని మనవడు అయిన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వలన కలిగిన బ్రహ్మ హత్య పాతకని వదిలించుకోవడానికి రాజన్న క్షేత్రంలోని ధర్మగుండ పుష్కరిలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి ఆ ధర్మగుండ కొలనులో శివలింగం బయటకు తీసి శివలింగాన్ని ప్రతిష్టించి పూజించిన నరేంద్రుడికి ఆ ముక్కోటి శంకరుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తిని కలిగించాడట.. ఆ శివలింగమే నేడు మనం కొలిచే మూలవిరాటని స్థల పురాణంలో ఉంది. చాళుక్యులు నిర్మించిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎంతో చారిత్రక ప్రసిద్ధి కలిగిన క్షేత్రం..

మొదటిసారి 1979లో ఆలయ పునరుద్ధరణ పనులు: మొట్ట మొదటిసారి 1979లో ఆధునిక హంగులతో ధర్మగుండము, కోటిలింగాలు, గర్భాలయ ద్వారాలు, రాజగోపురాలను అత్యాధునిక పురాతన శిల్పకళ, శైవ సాంప్రదాయాల ఉట్టిపడేలా ఆలయాన్ని పునరుద్ధరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో రాజన్నను దర్శించుకొని, ప్రతిఏటా రూ.100 కోట్లు నిధులు కేటాయించి సుమారు రూ.500 కోట్లతో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి రాజన్న సాక్షిగా మాట తప్పిన ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషితో.. దక్షిణ కాశిగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయ పట్టణ అభివృద్ధికి చరిత్రలో నిలిచేలా రాజనక్షేత్రాన్ని వేములవాడ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషితో ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. రాజన్న ఆలయ అభివృద్ధిని మూడు దశల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేశారు. జూన్ నెలలో మూఢలు, శుభ దినాలు లేకపోవడంతో జులై, ఆగస్టు నెలలో తొలి దశ పనులను ప్రారంభించేందుకు అర్చకులు ముహూర్తాలను చూస్తున్నారు. రాజన్న ప్రధాన దేవాలయంలోకి భక్తులను అనుమతించరు. నిత్యపూజలను మాత్రం అర్చకులు ప్రధాన దేవాలయ గర్భాలయంలో నిర్వహిస్తారు. రాజన్న అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో మొక్కులు చెల్లించే విధంగా భక్తులకు దైవ దర్శనాన్ని స్థానిక భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శించుకు నేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతో చారిత్రక, పురాణ నేపథ్యం కలిగి ఉన్న విభాగాలను ముట్టకుండా శృంగేరి శంకరమఠం పీఠాధిపతుల సూచనలు, సలహాల మేరకే ఆలయ విస్తరణ పనులు, శృంగేరి పీఠాధిపతుల సూచనలతో చారిత్రక, పురాణాల నేపథ్యం ఉన్న భాగాలను, పురాతన గ్రంథాలు, రాతి శాసనాల్లో ఉన్న విధంగా  వేద, ఆగమ శాస్త్రాల ప్రకారం, ఆధ్యాత్మికం ఉట్టిపడేలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అభివృద్ధిని విస్తరించేందుకు ఇప్పటికే ప్రణాళికలను రూపొందించుకొని శృంగేరి పీఠాధిపతుల అనుమతులు సూచనల మేరకు దేవాలయ పట్టణాభివృద్ధికి అంకురార్పణం చేయనున్నారు.

100 సంవత్సరాల మాస్టర్ ప్లాన్ తో అభివృద్ధికి ప్రణాళికలు..పురాణ, పౌరాణికనేపథ్యం కలిగిన ధర్మగుండ పుష్కరిణి , గుడి చెరువు ప్రాశస్త్యం తగ్గకుండా 35 ఎకరాల్లో విడతల వారీగా అభివృద్ధి పనులు మొదలుకానున్నాయి. అన్నదాన సత్రం, క్యూ కాంప్లెక్స్ లు, వసతిగృహాలు, గాలి గోపరాలు ప్రాకారాలు, కార్యాలయం, మరో కోనేరు, కల్యాణకట్ట, కళ్యాణ మండపాలు, యాగశాలలో   కోడె మొక్కుల వాటిని కొత్తగా నిర్మించను న్నారు. ఇందకు మూడు దశల్లో రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.550 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా. ఇప్పటికే ప్రభుత్వం ఆలయ విస్తర ణకు రూ.76 కోట్లు, అన్నదాన సత్రానికి రూ.35 కోట్లు, రోడ్ల విస్తరణ పనులకు రూ.47.86 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. ఇటీవల బడ్జెట్ లో మరో రూ.100కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.ధర్మగుండం మధ్యలో శివుడి విగ్రహం, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా ధర్మగుండం పుష్కరిణి చుట్టూ పార్క్ ఆకట్టుకునే డిజైన్లను తయారు చేసి ఉన్నారు.

ఆధ్యాత్మిక – వైభవం రాజన్న క్షేత్రం.. పర్యాటక కేంద్రంగా పట్టణ, దేవాలయ అభివృద్ధి: వేములవాడ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. ఆధ్యాత్మిక – వైభవం రాజన్న క్షేత్రం.. సుందర భక్తి బావన ఉట్టిపడేలా 100 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను త్వరలోనే మొదలు పెట్టనున్నాం. నిత్యం వేల సంఖ్యలో స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళిక బద్ధంగా శ్రీ శృంగేరి పీఠాధిపతుల అనుమతులతో ఆగమశాస్త్రం ప్రకారం.. రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధంగా చేసి ఉన్నాయి. 24- 25 రాష్ట్ర బడ్జెట్లో రూ.50 కోట్లు 25- 26 బడ్జెట్లో 100 కోట్లు పెట్టుకోవడం జరిగింది. అలాగే వేములవాడ టెంపుల్ సిటీకే రోడ్ల విస్తీర్ణం రూ.47 కోట్లు మంజరై ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఖాతాలో ఉన్నాయి. అలాగే రూ.35 కోట్లతో అన్నదాన సత్రానికి టెండర్లు పూర్తయ్యాయి. రూ.76 కోట్లతో ఆలయ విస్తరణ పనులకు త్వరలోనే టెండర్లను పిలువబోతున్నట్లు ఎమ్మెల్యే ఆదే శ్రీనివాస్ తెలిపారు. దేవాలయ అభివృద్ధిలో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భీమేశ్వర ఆలయంలో భక్తుల దైవదర్శనం కల్పించన్నారు. చరిత్రకా, పురాణాల పౌరాణిక నేపథ్యం కలిగిన విభాగాలను ముట్టకుండా శృంగేరి, పీఠాధిపతుల సూచన సలహాలు మేరకే ఆలయ విస్తరణ పనులు జరగనున్నాయి. సువిశాలమైన రాజన్న ఆలయ నూతన గోశాల నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టాలి అని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇటీవల రూ.200 కోట్లతో వేములవాడ నియోజకవర్గనికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరి చేయడం పట్ల, ఏఐసీసీ ప్రకటించిన కమిటీల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, డిలీమిటేషన్ కమిటీ సభ్యులుగా నియమించడం పట్ల రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేసి, ప్రత్యేక కృత్ఞతలు తెలపడం జరిగిందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -