Saturday, June 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాజ్పూ ర్ లో డిజిటల్ క్లాసులు ప్రారంభించిన జడ్పీ సీఈవో శోభారాణి

తాజ్పూ ర్ లో డిజిటల్ క్లాసులు ప్రారంభించిన జడ్పీ సీఈవో శోభారాణి

- Advertisement -

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామం మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలో ఆర్.ఎస్.కె ఫౌండేషన్ అధినేత డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ వారి సొంత నిధులతో ఏర్పాటుచేసిన డిజిటల్ క్లాస్ రూమ్స్ కి సంబంధించిన స్మార్ట్ టీవీలను ప్రారంభించారు. ముందుగా ముఖ్య అతిథులుగా హాజరైన వారికి ఆయన ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించి పూల బొక్కెను అందజేశారు. కార్యక్రమానికి ముందుగా పాఠశాల ఆవరణలో మొక్కలను నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీసీఈఓ ఎన్ శోభారాణి, ఆర్ఎస్ కె ఫౌండేషన్ అధినేత డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ చేతుల మీదుగా పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ గవర్నమెంట్ పాఠశాల అయినప్పటికీ ప్రవేట్ పాఠశాలకు ధీటుగా స్మార్ట్ టీవీలతో డిజిటల్ క్లాస్ రూమ్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

ప్రస్తుత కాలంలో తల్లితండ్రులు డబ్బులు లేకపోయిన గవర్నమెంట్ స్కూల్ పై వున్నా అపోహలతో పిల్లలను ప్రైవేట్ స్కూల్ లో చేర్పిస్తున్నారని ఇకనైనా తల్లితండ్రులు అపోహలు మానుకొని పిల్లలను గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించి చదువు చెప్పించాలన్నారు. ప్రస్తుత కాలంలో డిగ్రీ పాసైనా వారిని ప్రయివేట్ స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులుగా తీసుకుంటున్నారని కానీ గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ ఉద్యోగం కోసం ఉండాల్సిన విద్యార్హత పూర్తైన తరువాతే గవర్నమెంట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరుతారన్నారు. రానున్న రోజుల్లో పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు కానీ పాఠశాలకు ఏ విధమైన సహాయం కోరిన వారు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగస్వాములైన ర్యాకల శ్రీనివాసును ఆదర్శంగా తీసుకొని జిల్లాలోని ప్రతీ మండలానికి ఒకరు దాతలు ఇలా ముందుకు రావాలని శ్రీనివాసును కొనియాడుతూ వారు చేసే సేవ కార్యక్రమాలను అభినందిస్తూ వారిని సన్మానించారు.

ఈ కార్యక్రమంలో తాజ్ పూర్ గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, డీఈఓ కే.సత్యనారాయణ, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్, భువనగిరి మండల ఎంఈఓ పి నాగవర్ధన్ రెడ్డి మరియు , ఎంపీఓ ఎం దినాకర్, తాజ్ పూర్ గ్రామ పంచాయతీ సెక్రటరి వై.వెంకటేష్, ఏఏపీసి చైర్మన్ ఓరుగంటి రమ్య, తాజ్ పూర్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులు, తల్లిద్రండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -