– ఒక్కసారి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు
– డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు
నవతెలంగాణ – కామారెడ్డి
బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఎన్నో విపత్తులు జరిగాయనీ ఏ ఒకసారి కూడా ప్రజలకు, రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదనీ కామారెడ్డి డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు అన్నారు. ఏ రోజు కూడా స్పందించలేదనీ, నష్టపరిహారం అందించలేదు వారిని పరామర్శించిన పాపాన కూడా పోలేదన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్నటి రోజున బి ఆర్ ఎస్ నాయకులు మీడియా సమావేశం పెట్టి మంత్రులు తూతూ మంత్రంగా తిరుగుతున్నారని మాట్లాడుతున్నారనీ, ప్రభుత్వం ప్రభుత్వ అధికార యంత్రాంగం సకాలంలో స్పందించి చర్యలు చేపట్టడం ద్వారా ప్రాణా నష్టం జరగలేదన్నారు. విపత్తు సమయంలో రాజకీయాలు చేయకుండా సహాయం చేయాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందనీ, ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి పర్యవేక్షించి రివ్యూ చేయాలనుకున్నారు. హెలికాప్టర్ లో వచ్చి ఏరియల్ సర్వే చేశారు గాని వాతావరణం అనుకూలం లేనందున కామారెడ్డి లో దిగలేకపోయారన్నారు. హుటాహుటిన మంత్రులను అధికారులను అప్రమత్తం చేసి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ డి ఆర్ ఎఫ్, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు షబ్బీర్ అలీ ఫౌండేషన్ వారు యుద్ధ ప్రాతిపదికంగా సహాయక చర్యలు చేపట్టి ప్రాణ నష్టం జరగకుండా కష్టపడ్డారన్నారు. నివాసం కోల్పోయిన వారికి కళ్యాణ మండపాల్లో నివాసం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు పట్టణంలో 3,000 మందికి మండలాల్లో 2000 మందికి అన్నదానం చేయడం జరిగిందన్నారు. తక్షణ సహాయం కింద 11,500 ప్రకటించి విడుదల చేశారు. షబ్బీర్ అలీ అభ్యర్థున మేరకు ఎమ్మెల్సీల బృందం పర్యటించి అధికారులు, నాయకులు మంత్రులు పర్యటించి సర్వేలు నిర్వహించి జరిగిన నష్ట అంచనాలు ప్రభుత్వానికి పంపించడం జరిగిందనీ, త్వరలో నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఎన్నో విపత్తులు జరిగాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES