– రుణమాఫీ కోసం సగం మంది ఎదురుచూపులు : ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. రుణమాఫీ కోసం ఇంకా సగం మంది రైతులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. గురువారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుభరోసా ఇవ్వట్లేదన్నారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ అయిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ రుణాలుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు లక్ష్యంగా నిర్దేశించబడ్డాయి? ఆ టార్గెట్ ఎంత? ఎంత వరకు అమలైంది? డీఎల్బీసీ మీటింగ్ జరగని జిల్లాలెన్ని అని ప్రశ్నించారు. ఫసల్బీమా యోజన పథకాన్ని అమలు చేస్తామని కూడా రేవంత్రెడ్డి సర్కారు మోసం చేసిందని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ని క్లీన్ చిట్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందేమోననే అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అల్లకల్లోలంగా మారిందని విమర్శించారు. మేధావులు ఓటేసి గెలిపించిన రెండు ఎమ్మెల్సీ విజయాలు కేంద్ర సహకారానికి నిదర్శనమన్నారు. కేంద్రం రాష్ట్రానికి నిధులివ్వకపోతే బీజేపీకి ఆ విజయాలు ఎలా సాధ్యమయ్యేవి అని ప్రశ్నించారు. 11 ఏండ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రతి రూపాయి వివరాన్ని పుస్తక రూపంలో కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి విడుదల చేశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కర్నాటకతో పాటు తెలంగాణలో కూడా కాంగ్రెస్కు అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయన్నారు.
రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ సర్కార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES