నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ని వనదేవతలకు నటుడు, మిమిక్రీ కళాకారుడు ప్రముఖుడు శివారెడ్డి తన కుటుంబ సమేతంగా శుక్రవారం వనదేవతలను దర్శించుకున్నారు. ఎండోమెంట్ అధికారులు పూజారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు వనదేవతలకు చీరే సారే పసుపు కుంకుమ లతోపాటు తులాభారం వేసుకుని వారి తల్లి నిలువెత్తు బంగారం (బెల్లం) కూడా సమర్పించి, ప్రత్యేక మొక్కులు చెల్లించారు. వారి తల్లి వెంకటమ్మ అనారోగ్యంతో ఉండడంతో సమ్మక్క- సారలమ్మ వనదేవతలకు మొక్కుకోవడం వలన ఆరోగ్యంగా మారిందని, తిరిగి మొక్కులు చెల్లించడానికి శుక్రవారం వనదేవతల సన్నిధికి వచ్చినట్లు తెలిపారు. కాగా శివారెడ్డి నటుడు, గొప్ప మిమిక్రీ కళాకారుడు, వ్యాఖ్యాత, 100 కి పైగా సినిమాల్లో నటించాడు. దేశ విదేశాల్లో 6 వేలకు పైగా అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. ఇతను మన తెలంగాణ రాష్ట్ర కరీంనగర్ జిల్లా రామగుండం(పెద్దపెల్లి జిల్లా) ముద్దుబిడ్డ. అతని అమ్మ వెంకటమ్మ 100 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. వనదేవతలను దర్శించుకుని ఎంతో ఆహ్లాదకరంగా, ఉల్లాసంగా గడిపారు.
వనదేవతలను దర్శించుకున్న నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES