నవతెలంగాణ – పెద్దవూర
గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్టతో పాటు ఉరకలేస్తున్న గోదారమ్మ సోయగాలను వీక్షించవచ్చు. నీటి మీదరాతలు రాయలేం గానీ నీటిని ఆపి ఆనకట్ట కట్టి డెల్టాప్రజల నుదుటి
మార్చిన ‘దేవుడు’ సర్ ఆర్థర్ కాటన్ కాటన్ అని బుసిరెడ్డి పౌడేషన్ ఛైర్మెన్ బుసిరెడ్డి పాండు రంగారెడ్డి అన్నారు. గురువారం సర్ అర్థర్ కాటన్ జయంతి సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్బంగా క్రీ.శ. 1803 సంవత్సరం మే 15న ఇంగ్లాండు అడ్డీస్ కాంబేలో హెన్రీ కాలేలీ కాటన్ దంపతులకు 10 వ సంతానంగా జన్మించిన అర్థర్ కాటన్ 15 ఏళ్ళ ప్రాయంలోనే కేడెట్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని సౌత్ ఇండియాలోని మద్రాస్ చీఫ్ ఇంజినీరింగ్ ఆఫీసులో ఉద్యోగం పొందారు. కరువుతో అల్లాడుతున్న మధుర, కోయంబత్తూరు, తిరునల్వేలి ప్రాంతాల్లో చెరువులను అభివృద్ధి చేసి ఆ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు చేసారు. 1840లో కృష్ణానదిపై ఆనకట్టకు ప్రతిపాదనలు రూపొందించి బ్రిటిష్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.
బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు కాటన్ తన జీవితాన్ని బ్రిటిషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల, నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఆంధ్రప్రదేశ్లో
ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందేలా చేసి చిరస్మరణీయడైయ్యాడు.1819లో మద్రాసు ఇంజనీరుల దళములో చేరి మొదటి బర్మా యుద్ధములో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్ బిరుదాంకితుడైనాడని ఆయన సేవలు ఎంతో చిరస్మనీయమని కొనియాడారు.
సర్ అర్థర్ కాటన్ జయంతి శుభాకాంక్షలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES