నవతెలంగాణ – జడ్చర్ల
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల, డాక్టర్ బి.ఆర్ .ఆర్ డిగ్రీ కళాశాలలో సీపీఆర్ పై విద్యార్థులకు 108 సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అత్యవసర పరిస్థితిలో సిపిఆర్ ఎలా నిర్వహించాలి అని విద్యార్థులకు 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ శివకుమార్ రెడ్డి పైలెట్ మల్లేశ్వర్ రెడ్డి అవగాహన కల్పించారు. సిపిఆర్ చేసే క్రమంలో ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలో స వివరంగా విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా సిపిఆర్ ప్రక్రియను విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు స్థానిక యుపిహెచ్ సి మెడికల్ ఆఫీసర్ మధుప్రియ ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు 108 సిబ్బందికి అభినందనలు తెలిపారు.
సీపీఆర్ పై 108 సిబ్బంది అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


