- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీపావళి సెలవుల తర్వాత ఇవాళ ఉదయం తిరిగి పాఠశాలకు వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



