నవతెలంగాణ – హైదరాబాద్: ఇటీవలే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఆ పార్టీకి ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన దాదాపు 13 మంది ఢిల్లీ కౌన్సిలర్లు ఆప్కు రాజీనామా చేశారు. ఇందులో రెబల్ కౌన్సిలర్లు ముఖేష్ గోయల్ కూడా ఉన్నారు. ఆయన నాయకత్వంలో వీరంతా థర్డ్ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తమ పార్టీ పేరును కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. ‘ఇంద్రప్రస్థ వికాస్’ పేరుతో పార్టీని ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గోయెల్ ఆదర్శ్ నగర్ నియోజకవర్గం నుంచి ఆప్ టికెట్పై పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఇక రాజీనామా చేసిన రెబల్ కౌన్సిలర్లలో.. ముఖేష్ గోయల్, హేమంచంద్ గోయల్, దినేష్ భరద్వాజ్, హిమానీ జైన్, ఉషా శర్మ, సాహిబ్ కుమార్, రాఖీ కుమార్, అశోక్ పాండే, రాజేష్ కుమార్, అనిల్ రాణా, దేవేంద్ర కుమార్, హిమానీ జైన్ ఉన్నారు. గత మున్సిపల్ ఎన్నికలకు ముందు వీరంతా కాంగ్రెస్ను వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.
ఆప్ కు 13 మంది రెబల్ కౌన్సిలర్లు రాజీనామా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES