- Advertisement -
హైదరాబాద్ : ఈ నెల 27న గచ్చిబౌలి స్టేడియంలో సన్రైజ్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల స్పోర్ట్స్ ఈవెంట్ జరుగనుంది. 1958 నుంచి సన్రైజ్ హైస్కూల్లో విద్యాభ్యాసం చేసిన 1500-2000 మంది వరకు ఈ స్పోర్ట్స్ సమ్మేళనానికి రానున్నారు. వివిధ క్రీడాంశాల్లో జులై 27 మధ్యాహ్నం 2 గంటల నుంచి పోటీలు ఆరంభం అవుతాయని స్కూల్ ప్రిన్సిపాల్ సిమీన్ మునీర్ తెలిపారు. స్పోర్ట్స్ ఈవెంట్లో భాగం కావాలనుకునే పూర్వ విద్యార్థులు 7207249868 నెంబర్ను సంప్రదించగలరు.
- Advertisement -