– ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచింది. ప్రస్తుతం ఉన్న 26.39 శాతం డీఏను 30.03 శాతానికి పెంచారు. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుంది. పెరిగిన డీఏను ఉద్యోగులకు వచ్చే నెల (జులై)1 నుంచి చెల్లిస్తారు. అయితే 2023 జనవరి ఒకటి నుంచి 2025 మే 31 వరకు పెరిగిన డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక డీఏను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మరో డీఏను ఆరు నెలల తర్వాత ఇస్తామని ప్రభుత్వం ప్రక టించిన విషయం తెలిసిందే.
ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES