- Advertisement -
నవతెలంగాణ -గాంధారి
ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు దళారులు అక్రమంగా ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు. మండలంలోని గౌరారం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 32 క్వింటాల్లో రేషన్ బియ్యాన్ని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసి ఇతరరాష్ట్రాలకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని బొలెరో వాహనంతో సహా గాంధారిసబ్ ఇన్స్పెక్టర్ బి.ఆంజనేయులు నిఘా పెంచి గౌరారం గ్రామం నందు బొలెరో వాహనం లో రవాణా చేస్తుండగా పట్టుకున్నారు.
- Advertisement -