- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సోలార్ ప్లాంట్లు నెలకొల్పే మహిళలకు నాలుగు ఎకరాల భూమి కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించి ప్రభుత్వ భూములను గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. ఒక్కో మెగావాట్ ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు రూ.3 కోట్ల వ్యయం కానుంది. ఇందులో 10% మహిళా సంఘాలు భరించనుండగా, మిగిలిన 90% బ్యాంకుల ద్వారా రుణాలుగా అందిస్తారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా సిద్ధంగా ఉన్నాయి.
- Advertisement -