Tuesday, June 3, 2025
E-PAPER
Homeజిల్లాలుకార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

- Advertisement -

– సీఐటీయూ జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనంజయ

నవతెలంగాణచండూర్

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని కోరుతూ మే 20న కార్మిక సంఘాలు, స్వతంత్ర సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్తం సార్వత్రిక సమ్మెలో హమాలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనంజయ పిలుపునిచ్చారు.
మంగళవారం చండూరు మండల కేంద్రంలో మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా వాల్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది హమాలీ కార్మికులు ఉన్నారని అన్నారు. వ్యవసాయ మార్కెట్లో హమాలీలు, దడువాయిలు, స్వీపర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఐకెపి హమాలీలు, రైస్, ఆయిల్, దాల్ మిల్లుల హమాలీలు, స్టీల్, సిమెంట్, ఫర్టిలైజర్, కిరాణం తదితర బజార్ హమాలీలు, ప్రభుత్వ రంగాలైన ఎస్ డబ్ల్యూసి, సిడబ్ల్యూసి గోదాము హమాలీలు సివిల్ సప్లై హమాలీలు, బేవరేజెస్ హమాలీలు, ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎఫ్సీఐ, రైల్వే గూడ్స్ షెడ్ హమాలీలు తదితర సంఘటిత అసంఘటిత రంగాలలో ఎగుమతి దిగుమతి పనులు చేస్తూ తమ రక్తాన్ని చెమటగా మార్చి సరుకుల రవాణాలో కీలక భూమిక పోషిస్తున్నారని ఆయన అన్నారు.
ఇంత చాకిరి చేస్తున్న హమాలీలకు ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి సామాజిక భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ ,బోనస్ వంటి చట్టబద్ధ హక్కులు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. కార్మిక వర్గానికి స్వాతంత్రానికి ముందు తర్వాత పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో తమకున్న మందబలంతో ఆమోదింప చేస్తుందని ఆరోపించారు. ఈ కోడ్స్ అమలయితే కార్మిక హక్కులన్నీ హరించిపోతాయని రెండు సంవత్సరాలకు ఒకసారి యజమానులతో భేరసారాలు ఆడి హమాలీల కూలి రేట్లు పెంచుకునే సాంప్రదాయం లేకుండా పోతుందని, సంఘం పెట్టుకునే హక్కు, సంఘటితంగా సమ్మె చేసే హక్కు, ఉమ్మడి భేరసారాల హక్కులు లేకుండా పోతాయని అన్నారు.
హమాలీల రక్షణ కోసం భవన నిర్మాణ కార్మికుల వలె హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వ గుర్తింపు కార్డులు పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ పిల్లలకు స్కాలర్ షిప్లు ప్రమాద బీమా తదితర సంక్షేమ పథకాలు అమలు చేయాలని అయినా అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే హమాలీలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

హమాలీల సంక్షేమం కోసం కొన్ని కొత్త హక్కులు కల్పించాలని పోరాటం చేస్తుంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించకపోగా ఉన్న వాటినే లేకుండా చేసి బ్రిటిష్ కాలం నాటి బానిసత్వంలోకి నెట్టాలని చూస్తుందని ఆరోపించారు. ఇందులేని పేద హమాలీల అందరికీ ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి 120 గజాల స్థలం ఇచ్చి కేంద్రం 10 లక్షలు రాష్ట్రం 50,0000 ఆర్థిక సహాయం అందించి హమాలీ కాలనీలు నిర్మించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని పని ప్రదేశాలలో మంచినీరు విశ్రాంతి గదులు సైకిల్ చెట్లు మరుగుదొడ్లు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించాలని పని ప్రదేశాల్లో ప్రమాదంలో మరణించిన హమాలీ కార్మికులకు 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా హమాలి కార్మికులందరూ సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలని మే 20 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని ఆయనపిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, రైతు సంఘం నాయకులు బల్లెం స్వామి, ఈరటి వెంకటయ్య, హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సాయం కృష్ణయ్య, శేఖర్, నాగేష్, నాగరాజు, చిరంజీవి, ఆకాషి, లింగస్వామి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -