- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో 41 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 12 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 32 మంది మావోయిస్టుల తలపై ప్రభుత్వం రూ.1.19 కోట్ల రివార్డును ప్రకటించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ లొంగుబాటు బీజాపూర్ ప్రాంతంలో శాంతి స్థాపనకు ఒక కీలక పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు.
- Advertisement -


