Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే: ఎమ్మెల్సీ కవిత

బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే: ఎమ్మెల్సీ కవిత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకే రైల్ రోకోకు పిలుపునిచ్చాం.. ఎన్ని అడ్డంకులు సృష్టించిన రైల్ రోకో కార్యక్రమం చేసి తీరుతామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ జూలై 17న తలపెట్టిన రైల్ రోకోకు మద్దతుగా సింగరేణి జాగృతి రూపొందించిన పోస్టర్‌ను సోమవారం తన నివాసంలో కవిత ఆవిష్కరించారు.

ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, బీసీ సమాజం పోరాటాలతోనే ప్రభుత్వం దిగివచ్చిందని, అసెంబ్లీ, కౌన్సిల్ లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు వేర్వేరు బిల్లులు పాస్ చేసిందని చెప్పారు. ఈ బిల్లులకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా చేయలేదని వివరించారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జూలై 17న రైల్ రోకోకు పిలుపునిచ్చామని అన్నారు.

బీసీ రిజర్వేషన్లు తేల్చకుండానే తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీల పరంగా అవకాశం కల్పించడం కాదు.. బీసీలకు చట్టబద్దమైన రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రైల్ రోకోకు సింగరేణి జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, బీసీ రిజర్వేషన్ల కల్పన, రైల్ రోకో అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -