రెన్యూవల్ 5,628 ….కొత్తవి 85
నవతెలంగాణ – మల్హర్ రావు
రైతులు అకాల మృత్యువాత పడితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదని గత ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభించిన ప్పటి నుంచి ఇప్పటివరకు మండలంలో ఎంతో మంది రైతు కుటుంబాలను ఆదుకుంది. అయితే గతంలో రైతుబీమా నమోదు చేసుకోని వారే కాకుండా, ఇటీవల కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన వారికి కూడా అవకాశం కల్పించింది. ఇందుకోసం ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. మండలంలో మొత్తం 5,713 మంది రైతులు బిమాకు ఎంపిక కాగ ఇందులో 5,628 మంది పాతవి రిన్యువల్,85 మంది రైతులు కొత్తగా ఎంపికయ్యారు.
ఇటీవల కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన మంది రైతులు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటిం చింది.దీంతో వ్యవసాయ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించారు. దీంతో రైతులు సైతం ముందుకొచ్చారు. నిరాక్షరాస్యులైన రైతుబీమా రైతుల వివరాలు సేకరించి అధికారులే ఆన్లైన్ చేయించారు.మండల వ్యాప్తంగా మొత్తం 5,713 మంది రైతులు బీమాకు నమోదు చేసుకున్నారు. కాగా ఈ పథకానికి ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియం చెల్లిస్తుంది. రైతు అకాల మృత్యువాత పడితే వారి నామినీ అకౌంట్లో రూ.5 లక్షలు జమవుతాయి. అయితే కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన మరికొంత మంది రైతులు అందుబాటులో లేక నమోదు చేసుకోలేకపోయారు. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో ఉన్నవారు, ఇత రత్ర కారణాలతో కొంతమంది నమోదుకు ముం దుకు రాలేదు. అయితే ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న ఆస్తి హత్యలకు భయపడి కొంతమంది నామినీ పెట్టడం ఇష్టం లేక నమోదు చేసుకోలేదని తెలిసింది.అత్యధికంగా పట్టణాల్లో నివసించేవారు, బడా రైతులు నమోదు చేసుకోనట్లు సమాచారం.
రైతు బీమాకు 5,713 మంది రైతులు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES