నవతెలంగాణ-హైదరాబాద్: రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయానికి 80 ఏళ్ల పూర్తయిన సందర్భంగా చైనా భారీ కవాతు నిర్వహించింది. తొలిసారి అధునాతన యుద్ధ విమానాలు, క్షిపణులను ప్రదర్శించింది. ప్రపంచానికి ఒక సందేశం పంపించేందుకు చైనా ఈ ప్రదర్శన చేపట్టింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ హాజరయ్యారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు లతో సహా 25 దేశాధినేతలంతా హాజరయ్యారు. చైనా సైనికులు నిర్వహించిన భారీ కవాతును నేతలంతా తిలకించారు.

విక్టరీ పరేడ్ లో భాగంగా డ్రోన్లు, హైపర్సోనిక్ క్షిపణులు, యుద్ధ విమానాలు వంటి అధునాతన సైనిక పరికరాల ప్రదర్శించారు.భూమి, సముద్రం, గాలి నుండి ఒకేసారి ప్రయోగించగల అణ్వస్త్ర సామర్థ్య క్షిపణులను చైనా ఆవిష్కరించింది – ఇందులో వాయు ఆధారిత, దీర్ఘ-శ్రేణి క్షిపణి అయిన జింగ్లీ-1; జలాంతర్గామి ఆధారిత ఖండాంతర క్షిపణి అయిన జులాంగ్-3; భూ ఆధారిత ఖండాంతర క్షిపణులు అయిన డాంగ్ఫెంగ్-31, డాంగ్ఫెంగ్-61 ఉన్నాయి.
చైనా యింగ్జీ-17, యింగ్జీ-19, యింగ్జీ-20 లను కూడా ప్రదర్శించింది, ఇవి US విమాన వాహక నౌకల నమూనాలకు వ్యతిరేకంగా చైనా పరీక్షించిన హైపర్సోనిక్ యాంటీషిప్ క్షిపణులున్నాయి.

