నవతెలంగాణ-రామారెడ్డి : మండలంలో 11 జిల్లా పరిషత్ పాఠశాల పరిధిలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు 433 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 416 మంది ఉత్తీర్ణత సాధించి మండలo 96.07 ఉత్తీర్ణ శాతం సాధించారు. రెడ్డిపేట్, ఉప్పల్వాయి,కేజీబీవీ రామారెడ్డి, ఉప్పల్వాయి గురుకులంలో 100% ఉత్తీర్ణత సాధించారు. రామారెడ్డి బాలుర జిల్లా పరిషత్ పాఠశాల 40% ఉత్తీర్ణత సాధించి మండలంలో చివరి స్థానంలో నిలిచింది.సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉప్పల్వాయి విద్యార్థి జే అరుణ్ తేజ 571 మార్కులతో మొదటి స్థానంలో నిల్వగా, జిల్లా పరిషత్ గిద్ద పాఠశాలకు చెందిన ఎన్ లాస్య రెడ్డి 570 మార్కులతో ద్వితీయ స్థానంలో, పోసానిపేట జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన సార్త్విక 569 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచినట్లు ఎంఈఓ ఆనందరావు తెలిపారు.
పదో తరగతి ఫలితాల్లో 96.07% ఉతీర్ణత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES