నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
అక్టోబర్ 15 తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు వెల్దండ మండలం రాచూర్ గ్రామంలో ఉన్నటువంటి పశువులు, గేదెలకు ఉచితంగా గాలికుంట వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని గ్రామ పశువుల డాక్టర్ నరేష్ ఒక రకంలో తెలిపారు. కావున పాడి పశువులు గేదెలు కలిగినటువంటి రైతు సోదరులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నరేష్ కోరారు. మూడు నెలల వయసు పైబడిన అన్ని పశువులు గేదెలకు గాలికుంట వ్యాధి నివారణ టీకాలు తప్పకుండా ఇప్పించగలరని రైతులను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాచూర్ గ్రామ పశువుల డాక్టర్ నరేష్ తెలిపారు. గాలికుంట వ్యాధి నివారణ టీకాలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
పశువులకు గాలికుంట వ్యాధి నివారణ టీకాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES