నవతెలంగాణ-హైదరాబాద్ : బిసి రిజర్వేషన్ల విషయంలో బీజేపీ దొంగ నాటకాలు ఆడుతుంది..బీసీలు తెలంగాణలో బీజేపీని నిలదీయండని సీపీఐ(ఎం) తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకుంటున్న బీజేపీ వైఖరిపై సీపీఐ(ఎం) చలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటి సభ్యులు ఎస్,వీరయ్య, టి. జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ఎండి అబ్బాస్, టి.సాగర్, బండారు రవికుమర్, హైదరాబాద్ నగర కార్యదర్శి వెంకటేశ్, రాష్ర్ట కమిటి సభ్యులు, నగర కమిటి నాయకులు పాల్గొన్నారు.
బిసి రిజర్వేషన్లును అడ్డుకుంటున్న బిజెపి ప్రధాన ముద్దాయి..
బిసిలకు బిజెపి చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించండి. తెలంగాణ గవర్నర్ బిజేపీ తొత్తుగా కాకుండా.. రాజ్యాంగ బద్దంగా పనిచేయాలి. చలో రాజ్ భవన్ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య