- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: 42% రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపట్టాయి. ఉదయం 4 గంటల నుంచే బంద్ అమలులోకి వచ్చింది. బీసీ సంఘాలు ఆర్టీసీ డిపోల వద్ద బస్సులను అడ్డుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కూడా ఈ బంద్ కు మద్దతు తెలిపాయి. మెడికల్ షాపులు, అంబులెన్సులు వంటి అత్యవసర సేవలు మినహా మిగతావి అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రజలు బంద్కు సహకరించాలని నేతలు కోరుతున్నారు.
- Advertisement -