- Advertisement -
నవతెలంగాణ – తిమ్మాజిపేట : మండలంలోని గుమ్మకొండ తండాకు చెందిన శంకర్ నాయక్ రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మన్య నాయక్ తండా గ్రామపంచాయతీ చౌట చెరువు తండా కు చెందిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రాము నాయక్ సతీమణి మెగావత్ మంజుల మృతి చెందిన సభ్యులను పరామర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంతక్రియలకు కుటుంబ సభ్యులకు 5 వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఆమె వెంట తండా వాసులు పలువురు ఉన్నారు.
- Advertisement -