- Advertisement -
నవతెలంగాణ-మిర్యాలగూడ
దీపావళి పండుగ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధికార ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్ దంపతులు సహకారంతో బాపూజీ నగర్ 7, 21 వ వార్డు మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలు ఆదివారం అందజేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నూతన వస్త్రాలు అందజేసినట్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనిదని కొనియాడారు. వేకువ జామున లేచి ఎండ అనాకా, వాన అనకా నిత్యం విధులు నిర్వహిస్తున్న కార్మికుల శ్రమను మరువలేనిది అన్నారు.చిరు కానుక గా వీరందరికీ నూతన వస్త్రాలను అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
- Advertisement -