Sunday, October 19, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆసిఫాబాద్‌ మండలం మోతుగూడ వద్ద జాతీయ రహదారిపై కారు.. బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వాంకిడి మండలం బెండారం గ్రామానికి చెందిన ఓ యువకుడు దీపావళి పండుగకు సోదరి, ఆమె పిల్లలను తీసుకెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో జగన్‌ (27), అక్క అనసూయ(32), ప్రజ్ఞశీల్‌(4) మృతి చెందారు. మరో పాపకు తీవ్రగాయాలు కావడంతో  కాగజ్‌ నగర్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -