- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐదేళ్లుగా తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి మృతదేహం మార్చురీలోనే ఉన్న ఘటన బహ్రెయిన్లో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన నరేశ్(40) ఉపాధికోసం బహ్రెయిన్ వెళ్లి 2020 మేలో మరణించాడు. అయితే ఈ సమాచారం లేక కుటుంబసభ్యులు ఐదేళ్లుగా ఎదురుచూశారు. ఇటీవల అధికారులు మృతిడి వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో విషయం తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మృతదేహం అక్కడి మార్చురీలో భద్రపరిచారు. మృతదేహం రప్పించాలని సోదరుడు ఆనంద్ దరఖాస్తు చేశాడు.
- Advertisement -