-ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
నవతెలంగాణ-బెజ్జంకి
తేమ, తరుగు పేరుతో కోతల్లేకుండా..కొనుగోళ్లు చేయాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ఏఎంసీ యందు మొక్కజొన్న ధాన్యం, తోటపల్లి, ముత్తన్నపేట, కల్లేపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి ఏఎంసీ, పీఏసీఎస్ చైర్మన్లు పులి క్రిష్ణ, తన్నీరు శరత్ రావు, కాంగ్రెస్ నాయకులు ఒగ్గు దామోదర్, ముక్కీస రత్నాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. పార్టీ మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు అక్కరవేణి పోచయ్య ముదిరాజ్, ఏఎంసీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బైర సంతోష్, గూడెల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కొతల్లేకుండా..ధాన్యం కొనుగోళ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES