Thursday, October 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి

- Advertisement -

ఆస్ట్రేలియా సంస్థ ఒరికా ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు భేటీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ ‘ఒరికా’ ప్రతినిధులను మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. ఆ దేశ పర్యటనలో భాగంగా బుధవారం మెల్‌బోర్న్‌లో పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీ, మైనింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తదితర రంగాల్లో అంతర్జాతీయ అగ్రగామిగా ఉన్న ఆ సంస్థ సీఈఓ, ఎండీ సంజీవ్‌ గాంధీ, ఇతర ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో ‘ఒరికా’ ప్రస్తుత కార్యకలాపాలు, భవిష్యత్‌ విస్తరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించారు. ‘ఇన్నోవేషన్‌, టెక్నాలజీ హబ్‌లను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. జీసీసీలు, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అత్యంత అనుకూలం. పారిశ్రామికాభి వృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ఎకో సిస్టమ్‌, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉంది’ అని ఈ సందర్భంగా మంత్రి కంపెనీ ప్రతినిధులకు వివరించారు.

ఇండిస్టీయల్‌ ఇన్నోవేషన్‌, సస్టెయినబిలిటీ, మాన్యుఫాక్చరింగ్‌, మైనింగ్‌ రంగాల్లో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కోసం తెలంగాణతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. ‘పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ, అమలు చేస్తున్న ప్రోత్సాహాకర, ప్రగతిశీల విధానాలు అభినందనీయం. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న జీసీసీలో డిజిటల్‌ ఇంజనీరింగ్‌, ఆటోమేషన్‌, అడ్వాన్స్‌డ్‌ అనలిటిక్స్‌ తదితర రంగాల్లో 600 మంది హై స్కిల్డ్‌ నిపుణులకు ఉద్యోగాలు కల్పించాం. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. తెలంగాణలో కార్యకలాపాల విస్తరణ, వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఒరికా సంస్థ సీఈఓ సంజీవ్‌ గాంధీ తెలిపారు. ‘ఆస్‌ బయోటెక్‌ 2025 ఇంటర్నేషన్‌ కాన్ఫరెన్స్‌’లో కీలకోపన్యాసం చేసేందుకు మంత్రి శ్రీధర్‌బాబు ఆస్ట్రేలియాకు వెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -