- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలంలోనీ జూపల్లి గ్రామం నుండి వంగూరు గేటు కు వెళ్లే రోడ్డు దుస్థితిపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిపోయింది. గుంతలలో నీరు నిలిచిపోవడం వల్ల రోడ్డు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు కు మరమ్మత్తులు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
- Advertisement -


