- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులోని సేలం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దీపావళి పండగ నాడు ఎక్కువగా సెల్ఫోన్ వాడినందుకు తల్లిదండ్రులు విద్యార్థిని నివేద(17)ని మందలించారు. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఇంట్లో మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. పేరెంట్స్ వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. గురువారం ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



