- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గా అదనపు భాద్యతలు స్వీకరించిన గరీమా అగ్రవాల్ ను వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి ప్రసాదం అందజేసారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా ఇంచార్జి కలెక్టర్ ను ఈఓ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పురోగతిని ఈఓ జిల్లా ఇంఛార్జి కలెక్టర్ కు వివరించారు.
- Advertisement -



