Saturday, June 7, 2025
E-PAPER
Homeకరీంనగర్మాకు రేషన్ బియ్యం ఎప్పుడు ఇస్తారు..

మాకు రేషన్ బియ్యం ఎప్పుడు ఇస్తారు..

- Advertisement -

రేషన్ షాప్ ముందు గ్రామస్తుల నిరసన..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 
: నెలలో ఇప్పటికే 15 రోజులు గడిచిపోయింది అయినా మాకు ఇంకా రేషన్ బియ్యం అందించలేదు ఎప్పుడు పంపిణీ చేస్తారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని అంకుసాపూర్ గ్రామంలో మే నెల లో పంపిణీ జరగాల్సిన రేషన్ బియ్యం 15 రోజులు గడిచిన ఇంకా పంపిణీ చేయకపోవడంతో గ్రామస్తులు మంగళవారం రేషన్ షాప్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏ ఒక్క రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక్క కిలో బియ్యం కూడా అందించలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామంటూ ప్రభుత్వం ప్రహల్బాలు పలికారు.కానీ రేషన్ బియ్యాన్ని రేషన్ షాపులకే అందించిన దాఖలాలు లేవని గ్రామస్తులు ఆరోపించారు. ఒక్క నెల రోజులు మాత్రమే సన్న బియ్యం పంపిణీ చేశారని,సరిగా సన్న బియ్యం పంపిణీ చేయడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్ పంపిణీ చేస్తే తప్ప కొన్ని కుటుంబాల్లో పూట కూడా గడవని కుటుంబాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రతినెల మొదటి తేదీ నుండే 15 రోజుల వరకు పంపిణీ చేయాల్సి ఉండగా 15 రోజులు గడిచిన ఇప్పటివరకు గ్రామంలో ఒక్క కిలో బియ్యాన్ని కూడా పంపిణీ చేయలేదని మండిపడ్డారు. ఈ విషయంపై సంబంధిత తాసిల్దారు జయంత్ ను వివరణ కోరగా లారీల కొరత వల్ల బియ్యం సరఫరా ఆలస్యమైందని రెండు రోజుల్లోగా అన్ని గ్రామాల్లో రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -