Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి..

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి..

- Advertisement -

అఖిలభారత ఐక్య  రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  బి. ప్రభాకర్ 
నవతెలంగాణ – కామారెడ్డి
: ఈనెల 20న జరిగే సార్వత్రిక సమ్మెను ప్రతి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టియుసిఐ)  కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం  నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా  అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ప్రభాకర్ మాట్లాడుతూ  గత 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగినాయని,  కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కరువైందన్నారు.  మోడీ ప్రభుత్వం అవలంబించిన కార్పోరేట్ కంపెనీల అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలే ఇందుకు కారణమన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కనీస వేతనాల అమలు కోసం, కనీస  పెన్షన్ 9వేల అమలు కోసం, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లకు  వ్యతిరేకంగా, పనిగంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ సమ్మెలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, టి యు సి ఐ రాష్ట్ర నాయకులు ఏ రమేష్, టి యు సి ఐ జిల్లా కార్యదర్శి ఏ ప్రకాష్, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు జి సురేష్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి కిషోర్, కోశాధికారి ఎస్ కిషోర్, టి యు సి ఐ జిల్లా నాయకులు అనిస్, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం నరేందర్, పి ఓ డబ్ల్యూ జిల్లా నాయకులు ఏ అనిత, శంకర్, లాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -