నవంబర్ 7న మహోత్సవం
-అక్టోబర్ 28న మాలధారణ
నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని ప్రసిద్ధి చెందిన అడెల్లి శ్రీ మహా పోచమ్మ నూతన ఆలయం నవంబర్ 7 శుక్రవారం కొత్త విగ్రహ ప్రతిష్టాపన – మాలధారణ అక్టోబర్ 28 నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా భక్తులందరూ పాల్గొని తల్లి ఆశీస్సులు పొందాలని అడెల్లి పోచమ్మ దేవస్థాన కమిటీ చైర్మెన్ సింగం భొజా గౌడ్ తెలిపారు. వేద పండితులు చంద్ర శేఖర్ శర్మ,శ్రీనివాస శర్మ ఆద్వర్యంలో మంగళవారం ఉదయం ఆలయంలో భక్తులకు మాలధారణ ఉంటాంధన్నారు. అమ్మవారి సేవలో పాల్గొను ఆసక్తి ఉన్న భక్తులు ఉదయం ఆలయానికి చేరుకోవాలన్నారు.
ఈ సందర్బంగా దేవస్థానం కమిటి,ఆలయ కార్యనిర్వహణ అధికారి భూమయ్య అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంను ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా వైభవంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయిరు.అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఉత్సవాన్ని విజయవంతం చేయాలని వెల్లడించారు.



