నవతెలంగాణ – మిర్యాలగూడ : గత మూడు రోజులుగా కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని ఈ నెల 31 న శుక్రవారం ఉదయం 10 గంటలకు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో వేలాది ఎకరాల పంట నష్టపోయిందని రైతులందరికీ పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 30 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. దీనికోసం ఈ నెల 31 న శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నామని నియోజవర్గానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు.


