- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పెళ్లైన మూడు రోజులకే నవ వధువు శ్రీలత(21) పురుగుల మందు తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన వికారాబాద్ కోస్గి మండలం చంద్రవంచలో జరిగింది. అయితే భర్త వేధింపులే తమ కూతురి ఆత్మహత్యకు కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ మహబూబ్నగర్-తాండూర్ హైవేపై మృతదేహంతో బంధువుల ధర్నా చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -

 
                                    