Saturday, November 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుయూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

త్రినాథ్‌ కటారి హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇట్లు మీ ఎదవ’. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్‌ లైన్‌. సాహితీ అవంచ హీరోయిన్‌. సంజీవని ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై బళ్లారి శంకర్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. శుక్రవారం జరిగిన ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో, దర్శకుడు త్రినాథ్‌ కటారి మాట్లాడుతూ,’మేము ఒక మంచి సినిమా చేసాం. ఈ సినిమాకి కథే హీరో. ఇందులో నేను ఎదవ అని ఒక క్యారెక్టర్‌ చేశాను. ఇది ఒక తండ్రీ కొడుకులు కథ, తండ్రీ కూతుర్ల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ.. ఈ ముగ్గురు మధ్య ఉండే లవ్‌ స్టోరీ. నిర్మాత బళ్లారి శంకర్‌ చాలా మంచి వ్యక్తి. పట్నాయక్‌కి ఈ కథ చెప్తున్నప్పుడే ఒక హిట్‌ సినిమాకి పనిచేయబోతున్నాం అని చెప్పారు. అది చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాలో అందరం మంచి పాత్రలు చేశాం. అందరికీ కనెక్ట్‌ అయ్యే యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. 100% మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్‌ చేస్తాం’ అని తెలిపారు. ‘ఈ సినిమా కథ విన్నాను. నాకు బాపు సినిమా చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ సినిమా చేస్తే ఆ కోరిక తీరుతుందనే ఫీలింగ్‌ వచ్చింది.

త్రినాత్‌ డెడికేటెడ్‌గా, ప్యాషనేట్‌గా ఈ సినిమాకి పనిచేశారు. ఈ సినిమాకి టైటిల్‌ సూచించింది కూడా నేనే. కథ విన్నప్పుడే హిట్‌ వైబ్‌ వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత ఇంతకంటే మంచి టైటిల్‌ మరొకటి లేదనిపించింది. ఇది యూత్‌ అందరికీ తెగ నచ్చుతుంది. యూత్‌ వాళ్ళ పేరెంట్స్‌ని కూడా తీసుకెళ్లి చూపించే సినిమా అవుతుంది. సినిమా క్లైమాక్స్‌లో మీరు ఊహించని అద్భుతమైన కంటెంట్‌ ఉంటుంది. నటీనటులందరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇవ్వడంలో చాలా ఎంజాయ్ చేశాను. టెక్నీషియన్స్‌ అందరూ చాలా అద్భుతమైన వర్క్‌ ఇచ్చారు’ అని మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆర్‌.పి పట్నాయక్‌ చెప్పారు. హీరోయిన్‌ సాహితీ మాట్లాడుతూ,.’చాలా బ్యూటీఫుల్‌ స్టోరీ ఇది. చాలా మంచి ఎమోషన్స్‌ ఉంటాయి. అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది’ అని తెలిపారు. నిర్మాత బళ్లారి శంకర్‌ మాట్లాడుతూ,’ఇది నా ఫస్ట్‌ సినిమా. పట్నాయక్‌ మ్యూజిక్‌ అందించడం చాలా ఆనందంగా ఉంది. మాకు సపోర్ట్‌ చేస్తున్న డైరెక్టర్‌ బుచ్చిబాబు, హీరో శ్రీకాంత్‌, నిర్మాత కేఎస్‌ రామారావుకి కతజ్ఞతలు. మా సినిమాని అందరూ అదరిస్తారనే నమ్మకం ఉంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -