- Advertisement -
నవతెలంగాణ-వలిగొండ రూరల్
మండలంలోని బునాదిగాని కాలువ ద్వారా టేకులసోమారంలో నల్లచెరువు నిండి అలుగుపోస్తున్న సందర్భముగా రైతుల శ్రేయస్సు కోసం ఆ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, కాంగ్రెస్ నాయకులు చేగూరీ మల్లేశం ఆధ్వర్యంలో కాలువ నుండి చెరువు వరకు కాలువ ఏర్పాటుచేసిన సందర్భముగా చెరువు నిండి అలుగుపోస్తున్న సందర్భముగా ఆయన రైతులతో కలిసి చేరువులోనీ నీరుకు పూలు చల్లి హారతులు ఇచ్చి కట్ట మైసమ్మ తల్లికి పూజలు నిర్వహించారు.
అనంతరం మల్లేశంను రైతులు శాలువతో పూలమాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, పార్టీ కార్యకర్తలు, మల్లేషన్న యువ సేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



