Thursday, November 6, 2025
E-PAPER
Homeజాతీయంప్రారంభమైన బిహార్‌ తొలి విడత పోలింగ్‌

ప్రారంభమైన బిహార్‌ తొలి విడత పోలింగ్‌

- Advertisement -

నవతెలంగాణ పాట్నా: బిహార్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. నేడు 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. తొలివిడత ఎన్నికలకు 45,341 పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఆర్‌జేడీ 73, కాంగ్రెస్‌ 24, సీపీఐ(ఎంఎల్‌) 14 చోట్ల పోటీకి నిలిచింది. జేడీయూ 57 స్థానాలు, బీజేపీ 48, ఎల్‌జేపీ 14, ఆర్‌ఎల్‌ఎం రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది. ప్రశాంత్‌కిషోర్‌ సారథ్యంలోని జన్‌సురాజ్‌ పార్టీ నుంచి 119 మంది పోటీ చేస్తున్నారు. తొలి విడతలో తేజస్వీతోపాటు బీజేపీ నేత సామ్రాట్‌ చౌధరి, ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 14 మంది మంత్రులు పరీక్షను ఎదుర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -