- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ పరిధి హిమాయత్ నగర్ కూడలిలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మెడికల్ కాలేజీకి చెందిన బస్సు వెనుక నుండి మరో బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులను మరో వాహనంలో పంపించారు. హైదరాబాద్ – బీజాపూర్ రహదారిపై వరుసగా ప్రమాదాలు జరుగుతుండడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



