- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని అల్లం తోట బావి తండా రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా ధ్వంసం కావడంతో కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా మనీలా సంజీవ్ యాదవ్ రోడ్డు మరమ్మతు పనులు చేసేందుకు ముందుకు వచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గుండాల నుండి అల్లం తోట బావితండ మీదుగా పోతేపల్లి రోడ్డు మరమ్మతుకు స్వంత నిధులు వేచించి రోడ్డుకి ఇరువైపులా మొక్కలు తొలగించి మొరం పోయించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కడురం , మాజీ సర్పంచ్ కుమార్, మాజీ ఉప సర్పంచ్ శ్రీను, ఇస్లావత్ శంకర్, ఇస్లావత్ విజయ్, ఇస్లావత్ శంకర్,పోతేపల్లి వెంకటయ్య పాల్గొనారు.
- Advertisement -



