- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రానికి చెందిన చౌడేకర్ యోగేష్ కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా బంగారు పథకం అందుకున్నారు. చౌడేకర్ సంతోష్ యమున దంపతుల కుమారుడైన యోగేష్ 2020-21 సంవత్సరానికి గాను ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మారుమూల మద్నూర్ గ్రామం యోగేష్ బంగారు పథకం సాధించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -



