Saturday, November 8, 2025
E-PAPER
Homeజాతీయంరోడ్డుపై పోల్‌ స్లిప్స్‌..ఎన్నికల అధికారి సస్పెండ్‌

రోడ్డుపై పోల్‌ స్లిప్స్‌..ఎన్నికల అధికారి సస్పెండ్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో పెద్ద సంఖ్యలో పోల్‌ స్లిప్స్‌ను రోడ్డుపై పడేశారు. ఈ సంఘ‌ట‌న‌పై ఈసీ స్పందించింది. పోలింగ్‌కు ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) పరీక్షించేటప్పుడు మాక్‌ పోలింగ్‌ కోసం వినియోగించిన స్లిప్స్‌ అని తెలిపింది. సమస్తిపూర్ జిల్లా మేజిస్ట్రేట్ సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ జరిపినట్లు పేర్కొంది. నిర్లక్ష్యం వహించిన సంబంధిత అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్‌వో)ను సస్పెండ్ చేసినట్లు వివరించింది. ఈ సంఘటనపై కేసు కూడా నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.

నవంబర్‌ 6న ఆ రాష్ట్రంలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జ‌రిగిన విష‌యం తెలిసిందే.. ఈ స్లిప్పులను ఎవరు, ఎప్పుడు, ఎవరి ఆదేశాల మేరకు పడేశారు? అని ప్రశ్నించింది. ప్రజాస్వామ్య దోపిడీదారులు ఈ చర్యకు పాల్పడినట్లు ఆర్జేడీ ఆరోపించింది. దీనిపై సమాధానం చెప్పాలని ఈసీని నిలదీసింది. అలాగే ఈవీఎంలు ఉంచే స్ట్రాంగ్ రూమ్‌లకు భద్రతను పెంచాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్ కె ఝా కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు ఆయన లేఖ రాశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -