Wednesday, November 12, 2025
E-PAPER
Homeసినిమాభావోద్వేగాలు.. జీవిత సత్యాలు

భావోద్వేగాలు.. జీవిత సత్యాలు

- Advertisement -

విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రియలిస్టిక్‌ ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కిన మూవీ ‘రోలుగుంట సూరి’. అనిల్‌ కుమార్‌ పల్లా దర్శకత్వంలో నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలప్‌ హీరో, హీరోయిన్లుగా నటించారు. తపస్వీ ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై సౌమ్య చాందిని పల్లా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ప్రీ రిలీజ్‌ కార్యకమాన్ని నిర్వహించింది.
దర్శకుడు అనిల్‌ కుమార్‌ పల్లా మాట్లాడుతూ, ‘ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్‌ మా సినిమాపై ప్రశంసలు కురిపించారు. రియలిస్టిక్‌ విలేజ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో సినిమాను అద్భుతంగా చేశారని అభినందించడం మా చిత్ర యూనిట్‌కు కొత్త ఎనర్జీ వచ్చింది. మ్యూజిక్‌ పై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. అలాగే మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌ రూబెన్స్‌ లాంచ్‌ చేసిన మా సినిమాలోని పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ‘ఖుషి’ డైరెక్టర్‌ శివ నిర్వాణ మా సినిమా టీమ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రేక్షకులకు ఈ సినిమా కంటెంట్‌ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని భరోసా ఇచ్చారు. హీరో నాగార్జున పల్లా అథ్లెటిక్స్‌లో నేషనల్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌. యాక్టింగ్‌ టాలెంట్‌తో ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తాడు’ అని తెలిపారు.
‘నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కతజ్ఞతలు. ఇదే టీంతో మరో ప్రాజెక్టు చేయడానికి సిద్ధమవ్వడం చాలా సంతోషంగా ఉంది’ అని హీరో నాగార్జున పల్లా చెప్పారు. నిర్మాత సౌమ్య చాందిని పల్లా మాట్లాడుతూ, ‘ఇదొక రియలిస్టిక్‌ విలేజ్‌ డ్రామా. భావోద్వేగాలతో, జీవిత సత్యాలతో మిళితమైంది. సినిమా బాగా వచ్చింది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -