Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీఎన్జీవో సభ్యత్వ నమోదు

టీఎన్జీవో సభ్యత్వ నమోదు

- Advertisement -

నవతెలంగాణ- కంఠేశ్వర్ 
టీఎన్జీవోఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 2025-26 సంవత్సరానికి గాను బుధవారం ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్ ఆధ్వర్యంలో ఐ డి ఓ సి లోగల విద్యాశాఖ కార్యాలయంలో టీఎన్జీవోఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులు సుమన్ కుమార్ మాట్లాడుతూ…. టీఎన్జీవో సభ్యత్వ ప్రాముఖ్యతను తెలియజేస్తూ అన్ని శాఖల ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వాన్ని స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో ఉపాధ్యక్షులు శివకుమార్, సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, టిఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, విద్యాశాఖ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు అన్వేష్ టీఎన్జీవో సలహాదారులు వనమాల సుధాకర్ ఉద్యోగులు అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -