- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు పంట పొలాల్లో వందల సంఖ్యలో నాటు కోళ్లను వదిలి వెళ్లిన విషయం తెలిసిందే. స్థానికులంతా ఆ కోళ్లను పట్టుకుని ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆ కోళ్లను తినొద్దని వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు కీలక విషయాలు తెలిపారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే కోళ్ల ఫారం యజమాని కోళ్లను వదిలేసినట్టు పోలీసులు నిర్ధారించారు.
- Advertisement -



