- Advertisement -
నవతెలంగాణ మహబూబ్ నగర్: జిల్లా పాత బస్టాండ్ సమీపంలో భవనం కూల్చివేత పనులు జరుగుతుండగా అకస్మాత్తుగా గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -



