- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని రంగంపేట ప్రాథమిక పాఠశాలకు శుక్రవారం అవార్డీ టీచర్స్ అసోసియేషన్ కామారెడ్డి వారి సహకారంతో 20 కుర్చీలు వితరణ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ఆంజనేయులు మాట్లాడుతూ… విద్యార్థులకు కుర్చీలు అందజేసినందుకు అసోసియేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఆనందరావు, అసోసియేషన్ అధ్యక్షులు మనోహర్, శ్రీనివాస్, ఉపాధ్యాయురాలు రామ, కవిత, సిఆర్పి మహమ్మద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



