Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గాంధీజీలో ఘనంగా బాలల దినోత్సవం 

గాంధీజీలో ఘనంగా బాలల దినోత్సవం 

- Advertisement -

గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు..
నవతెలంగాణ  – చండూరు

స్థానిక గాంధీజీ విద్యాసంస్థల లో నవంబర్ 14, జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా శుక్రవారం  జరిగిన బాలల దినోత్సవ వేడుకలలో గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభం, శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులని, అందుకు సూచికగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలు జరుపుకుంటారని, మనదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటామన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఉన్నత ఫలితాలు సాధిస్తారన్నారు. దేశ నాయకుల వేషధారణలో చిన్నారులు అలరించారు. వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ భార్గవ్, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, తరుణ్ మాస్టర్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -